తెలుగు దురభిమానం 3

“కలిసి వుంటే కలదు సుఖము” అనేది తిరుగులేని సత్యము. అది నేను చెప్పినా, అమెరికన్ చెప్పినా, అంబనాధ్ చెప్పినా. అది “పాత చింతకాయ పచ్చడి” అన్నంత మాత్రాన సత్యము అసత్యమైపోదు.
ఇక కలిసి వుండటంలో వున్న కష్టాలు, బార్యాభర్తలు కలిసి వున్నప్పుడూ వుంటాయి. అయితే విడిపోయినప్పటి కష్టాలకంటే తక్కువే. ఒక్కసారి కన్నడ, ఉత్కళ, తమిల, ఆంద్ర దేశాలను వూహించుకోండి. కావేరి యుద్దము, కృష్నా యుద్దము, పోలవరం యుద్దం ఇలా ఇప్పటికి అందరమూ నీటికోసం యుద్దాలు చేస్తూ వుండేవాళ్ళం. తెలుగు వాళ్ళు అమెరికాకి, తమిళులు సింగపూర్ కి శ్రీలంకకి, ఈశాన్య రాష్ట్రాలు చైనాకి కొమ్ము కాసి యుద్దాలో, ప్రక్షన్న యుద్దాలో చేసుకుంటు వుండేవాళ్ళం. పరువు, ప్రతిష్ట, గుర్తింపు అనేవి మానవ జీవితాలకంటే గొప్పవి కావు. స్వేచ్చను ఇందులోంచి మినహాయించవచ్చు.
ఇక ప్రత్యేక తెలుగు రాజ్య భావన కొస్తే అసలిది పూర్వమెప్పుడూ లేదనే అనిపిస్తుంది. రాజులు తమకు సాద్యమయినన్ని రాజ్యాల్ని లోబరుచుకొంటూ సామ్రాజ్యాల్ని ఏర్పరచడానికి ప్రయత్నించారేగానీ బాషను బట్టి రాజ్యాలు లేవు. అలాగే మాతృబాష తులు అయినా రాయలు తెలుగుకే తన పట్టము కట్టాడు. అసలు మొన్న మొన్నటి వరకూ మద్రాసుకు తరలిపోయిన తెలుగువారు తమ దేశాన్ని వదిలి పరాయి దేశానికి వెల్తున్నామను కొన్నారా?
అయితే ఈ ఖండమంతా అధిక కాలం వేర్వేరు రాజ్యాలుగా వున్నా, ఆచారాల వల్ల, గురువుల వల్ల దీన్నంతటిని ఏక ఖండంగానే భావించారు. ఆది శంకరాచార్యులు కేరళకే పరిమితం కాలేదు. కాకపోతే ఇప్పుడు ఆంగ్లం చేస్తున్న పని అప్పుడు సంస్కృతం చేసింది. “హంపీ నుండి హరప్పా దాకా” పుస్తకంలో వేర్వేరు భాషల వారు పరిచయవాక్యాలు సంస్కృతంలో జరుపుకొని ఆ తర్వాత ఇద్దరికీ తెలిసిన భాషలో మాట్లాడుకొనేవారని చెప్తారు రచయిత. అలాగే వక్త గానీ, ప్రవక్త గానీ పరాయి భాష వాడని ఆదరించకపోవటం పరాయి దేశస్తుడుగా భావించడం మనకు పూర్వం నుండీ లేదు. మన తెలుగు వాడు త్యాగయ్య తమిళులకు ఆరాద్యదైవమయ్యాడు కదా! అలాగే షిరిడి సాయిబాబా మన ఇంటి దైవం కాలేదా?
మన సంస్కృతిలో మతాన్ని ఆద్యాత్మిక చింతనకీ, భాషను దైనందిన జీవితావసరంగా వాడుకొన్నారే గానీ, దాన్ని బట్టి మేము ప్రత్యేకమనే పొడ వున్నట్లుగా నాకనిపించదు.
ఈ “తెలుగు జాతి”కి పశ్చిమ దేశాల వారు “జాతి”కి ఇచ్చిన గుణాలన్నీ వున్నా, మనం జాతిని విడిగా నిర్వచించుకోవాల్సిందే. మన భరతజాతికి అంతర్లీనంగా వున్న ఏకాత్మత పశ్చిమీయులకు అర్థం కాదు. ఈ రాజకీయ విభజనలన్నీ బ్రిటిష్ వాడి వల్లైతేనేమి, స్వాతంత్ర్యకాంక్షవల్లైతేనేమి, మనకందరికీ ఆంగ్లేయుడు వుమ్మడి శత్రువు కావడం వల్లైతేనేమి, పటేల్ పట్టుదల వల్లైతేనేమి ఒకటయ్యాం. దీన్ని నిలబెట్టుకోవటానికి ప్రయత్నించాలేగానీ పూర్వమెప్పుడు మేము కలిసిలేమని ఇప్పుడూ కలిసి వుండమంటే ఎలా?
ఈ అంబనాధే చూడండి SAARC చట్రం కింద దక్షిణాసియా రాజ్యాలన్నీ కలిసి వుండాలంటూనే, డిల్లీ చట్రం కింద వుండనంటారు. కొత్తగా ఏ దేశం సభ్యరాజ్యాలనుండీ వుద్బవించినా దాని ప్రత్యేక అనుమతి లేకుండానే అది సార్క్ సభ్యదేశమయిపోవాలంటారు. బలం లేని SAARC తాడుతో కట్టివేయాలని చూసే ఈయన, బలమైన భరతరాజ్య బావనకు మాత్రం తూట్లు పొడవాలంటారు. (మీ, నా అనుమతి లేకుండానే మనల్ని తెలుగు జాతీయవాదుల్ని చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త!)
ఇక తెలుగు వారికి జరుగుతున్న న్యాయమేదైనా వుంటే దాన్ని కలిసివుండే ఎదుర్కోవాలి. విడిపోవడానికి లక్ష కారణాలు వున్నా, కలిసి వుండాటానికి ఒక మంచి కారణం చాలు. కలిసివుండటానికే నేనిష్టపడతాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: