ఏడవాలో నవ్వాలో తెలియట్లేదు. మొన్న మొన్ననే నడ్డి విరిచిన అయిదో వేతన సంఘం జ్ఞాపకాలు మరుగున పడక ముందే ఆరో వేతన సంఘము వచ్చేస్తోంది. ఠంచనుగా ప్రతి నెలా జీతాలు అందుకునే ఉద్యోగుల జీతభత్యాలు పట్టించుకునే వారే గానీ, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు, దినసరి కూలీలకు పట్టించుకునే వారేరి? ఈ వేతన సంఘాలు జీతాలు పెంచిన ప్రతిసారీ ద్రవ్యోల్బణం పెరిగి ముందే కష్టాలలో ఉన్న వారి వెతలు మరింతగా పెరిగిపోతున్నాయి. వాళ్ళకు నెలసరి రాబడి గ్యారంటీ చేసేదెవరు?
విపరీతమైన IT జీతాలే బీదల్ని మరింత దూరంగా ఉంచుతున్నాయంటే ఈ వేతన సంఘాలు తమ వంతు భాద్యత తీసుకుంటున్నాయి.
MP లు తమ జీతాలు, అలవెన్సులు తమ ఇష్టం వచ్చినట్లు పెచ్చుకుంటారు. MLAలు తమ జీతాలు, భత్యాలకు తోడుగా ఖరీదైన నగరాల్లో ఇళ్ళ స్థలాలు కూడా కేటాయింపజేసుకుంటారు.
బీదవాడి వేతన ఎవరికి పట్టింది. ఏరుగాలం కాయకష్టం చేసే రైతుకు ప్రకృతి కొంత అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వాలు, వేతన సంఘాలు వీలయినంతమేర వాళ్ళ కష్టాల్ని పెంచుతున్నాయి.
— ప్రసాద్
స్పందించండి